Oct 29,2023 00:50

సత్తెనపల్లి రూరల్‌: ఉమ్మడి గుంటూరు జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వ ర్యంలో అండర్‌ 19 బాలబాలికల హాకీ జిల్లా జట్ల ఎంపికలు సత్తెనపల్లి మండలం నందిగామ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగాయి. చేబ్రోలు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వ్యాయామ అధ్యాపకులు వై.పెద్దబ్బాయి పరిశీలకులుగా వ్యవహరిం చారు. ఎంపికైన క్రీడాకారులు వచ్చే నెలలో జరిగే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థాయి 67వ స్కూల్‌ గేమ్స్‌ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానో పాధ్యాయులు కె.శ్రీని వాసరావు, తోక సోమనాధ్‌, కె.వెంక ట్రావు, ఫిజికల్‌ డైరె క్టర్లు గంపా శ్రీను, పి.శివరామకృష్ణ, లాకు పిచ్చయ్య, బి. అనిల్‌ దత్తా నాయక్‌, సిహెచ్‌.వి. నాగరాజు, వీరచంద్ర, భాస్కరరావు హాజరయ్యారు. బాలురజట్టు: ఎ.బాలయేసు, ఎం.రుషి, ఎం.శివ దుర్గా గణేష్‌, కె. రాహుల్‌, సయ్యద్‌ షాహిద్‌ అహ్మద్‌, షేక్‌ సుభాని, కె.ఉత్తేజ్‌, ఎం.శరత్‌ చంద్ర, జె.ప్రవీణ్‌ కుమార్‌,కె.రాకేష్‌, పి.వెంకటేష్‌, పి. తేజ్‌ ప్రణీత్‌, బి. లక్ష్మి ప్రకాష్‌, కె.విజయ చోళుడు, డి.మధు మోహన్‌, షేక్‌ నజీర్‌, బి. వికాస్‌, ఎస్‌. దత్త సాయి. స్టాండ్‌ బై: షేక్‌ సమీర్‌, షేక్‌ సర్దార్‌, జి.అరుణ్‌. బాలికల జట్టు: బి. పావని సాయి, ఎన్‌. రమ్య,టి.స్రవంతి, సిహెచ్‌ లాస్య, పి.శివ బిందు, కె. శివనాగ అంజలి, ఎం. నీలిమ, జె.తనుశ్రీ, చట్టు జ్ఞాన శ్రీ అర్చన, వి.అఖిల,షేక్‌ ఆసిఫా, ఎ.హారిక, కె.వెంకట త్రివేణి, టి.జయలక్ష్మి, జి.కీర్తన, కె. మొహనలక్ష్మి, ఎం.వజ్ర వైడూర్య, డి.స్వరూప. స్టాండ్‌ బై: బి.అఖిల, కె. లక్ష్మి భవాని.