Mar 26,2022 23:48

విద్యార్థులను అభినందిస్తున్న దృశ్యం


ప్రజాశక్తి-పుత్తూరు టౌన్‌:
శనివారం విద్యార్థులను, ఏజీఎం డాక్టర్‌ శ్రీనివాసులు, అకడమిక్‌ కో ఆర్డినేటర్‌ బాలాజీ అభినందించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి ఇలాంటి పోటీ పరీక్షల్లో పాల్గొని విజయం సాధించాలన్నారు. శ్రీ చైతన్య పాఠశాల నుండి 99 మంది విద్యార్థులు ఐఎన్‌టిఎస్‌ఓ లెవెల్‌-2 పరీక్షకు ఎంపికయ్యారని, ఏప్రిల్‌ 3న ఆదివారం పుత్తూరులో నిర్వహించబోతున్నారన్నారు. కార్యక్రమంలో డీన్లు తిరునావుక్కరసు, మోహన్‌, సీ-బాచ్‌ ఇంచార్జ్‌ తిలకం, సరళాదేవి, రూపావాణి, పుష్పాంజలి, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.