
ప్రజాశక్తి - వినుకొండ : అధిష్టానం ఆదేశిస్తే వినుకొండ నుండి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వైసిపి నాయకులు నన్నపనేని సుధా అన్నారు. వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి, వినుకొండ మండలాల్లో ఆమె బుధవారం పర్యటించారు. పలు గ్రామాల్లో వైసిపి నాయకులను కలవడంతోపాటు అనారోగ్యంతో ఉన్న వైసిపి కార్యకర్తలను, నాయకులను పరామర్శించారు. మొదట వినుకొండ పట్టణంలోని కొత్తపేటలో గల సీనియర్ న్యాయవాది, వైసిపి నాయకులు చీరపురెడ్డి వెంకటరెడ్డి నివాసంలో పలువురు నాయకులతో కలిసి సమావేశమయ్యారు. అనంతరం ఈపూరు మండలం వడ్డేంగుంట పంచాయతీ దాసులపల్లిలో లక్ష్మీనరసింహ స్వామి ఆలయ శంకుస్థాపనకు హాజరయ్యారు. బొల్లాపల్లి మండలంలోని అయ్యన్నపాలెంలో వరికపూడిశెల సాధన కమిటీ నాయకులు రమణారావు, సభ్యులతో సమావేశమయ్యారు. బొల్లాపల్లి మండలంలో తీవ్ర సాగు తాగునీరు ఎద్దడి నెలకొందని, వరికపూడిశెల ప్రాజెక్ట్ ఎన్నికల స్టంట్గానే మారిందని, వెయ్యి అడుగులు బోర్లు వేసినా చుక్కనీరు లేదని, వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణంతోనే తాగు, సాగునీటి సమస్య తీరుతుందని కమిటీ సభ్యులు చెప్పారు. ప్రాజెక్ట్ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని ఆమె కమిటీ సభ్యులకు చెప్పారు. చక్రాయపాలెంలో కోట నాయక్ అత్త అనారోగ్యంతో ఉండడంతో ఆమెను సుధా పరామర్శించారు. ఐజి అనిల్ నాయక్ తండ్రి అనారోగ్యంతో ఉండడంతో లాలిపురం వెళ్లి ఆయనను పరామర్శించారు. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి వైసిపి నాయకులు గురు బ్రహ్మ రెడ్డి అనారోగ్యంతో ఉండడంతో ఆయన్ని సుధా పరామ ర్శించారు. బ్రాహ్మణపల్లి పంచాయతీ నిధులు గోల్మాల్ జరిగాయని ఆయన వివరించారు. వినుకొండ పట్టణానికి చెందిన గద్దల ప్రేమ్నాథ్ ప్రకాష్ను సుధ పరామర్శించారు. వైసిపి సీనియర్ నాయకులు గంట కాలేషా ఇంటికెళ్లి పరామర్శించారు. చాటగడ్డపాడుకు చెందిన అయ్యప్పరెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడి పట్టణంలోని జయంతి హాస్పిటల్లో చికిత్స పొందు తుండగా ఆస్పత్రికెళ్లి ఆయన్ను పరామర్శించారు. తుమ్మ వెంకటరెడ్డి కుటుంబాన్ని కలిశారు. ఆమెవెంట వైసిపి నాయకులు చింత ఆదిరెడ్డి, కొమ్మిరెడ్డి శివారెడ్డి, దాట్ల అంజిరెడ్డి, మురళి, రాఘవరెడ్డి, శ్రీనివాస్రెడ్డి ఉన్నారు.