Oct 26,2023 23:44

పోలీసు విధులు, పరికరాల పని తీరు వివరిస్తున్న ఎస్‌పి

ప్రజాశక్తి-అనకాపల్లి
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా స్థానిక ఎన్టీఆర్‌ స్టేడియంలో గురువారం ఏర్పాటు చేసిన పోలీసు ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌ శెట్టి, ఎస్పీ కెవి.మురళీకృష్ణ ప్రారంభించారు. విధి నిర్వహణలో పోలీసులు ఉపయోగించే వివిధ పరికరాలు, నేరస్తులను పట్టుకోవడంలో జాగిలాల పనితనం, క్రైమ్‌ కేసుల చేధనలో సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్‌ వినియోగం, మత్తు పదార్థాలు, పేలుడు పదార్థాలను కనిపెట్టడం, బాంబు డిస్పోజల్‌ పరికరాలు, నేరదర్యాప్తు విధానం తదితర విషయాలపై విద్యార్థులకు ఎస్‌పి మురళీకృష్ణ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగాలను విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) బి.విజయభాస్కర్‌, ఎస్‌బి ఇన్‌స్పెక్టర్‌లు చంద్రశేఖర్‌, అప్పలనాయుడు, పోలీసు కంట్రోల్‌ రూమ్‌ ఇన్‌స్పెక్టర్‌ పైడపునాయుడు, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు రామకృష్ణారావు, సతీష్‌, అనకాపల్లి టౌన్‌ ఎస్‌హెచ్‌ఓ మోహనరావు, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీను, కమ్యూనికేషనల్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటచిట్టి, ఎస్సైలు శేఖరం, సింహాచలం, ఆదినారాయణ, భవానివరప్రసాదరావు, ఢిల్లేశ్వరరావు, జీవీఎంసీ గర్ల్స్‌ హైస్కూల్‌, జీవీఎంసీ మెయిన్‌ స్కూల్‌, నారాయణ, భాష్యం, సర్వేపల్లి జూనియర్‌ కాలేజ్‌ విద్యార్థులు పాల్గొన్నారు.
సీతమ్మధార: పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో సిఐ ఎస్‌.విజయకుమార్‌ ఆధ్వర్యంలో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం నిర్వహించారు. విధి నిర్వహణలో పోలీసులు ఉపయోగిస్తున్న వివిధ ఆయుధాలను, అలాగే పోలీస్‌ స్టేషన్‌లోని వివిధ విభాగాలను విద్యార్థులకు చూపించి, వాటి పనితీరుపై అవగాహన కలిగేలా వివరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు వెంకటరావు, ప్రమీల, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థులకు పోటీలు
దేవరాపల్లి : పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా స్థానిక కెజిబివి విద్యార్థులకు వ్యాస రచన పోటీలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై డి.నాగేంద్ర మాట్లాడుతూ లైంగిక వేధింపుల నుంచి మహిళలు, పిల్లల రక్షణ, సామాజిక పాత్ర అనే అంశంపై ఈ పోటీలు నిర్వహించామన్నారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తామని ఎస్‌ఐ నాగేంద్ర తెలిపారు.
చోడవరం : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో చోడవరం పోలీసుల ఆధ్వర్యంలో డిబేట్‌, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థినిలకు స్థానిక ఎస్సై సూర్యనారాయణ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక సిబ్బంది పలువులు విద్యార్థులు పాల్గొన్నారు.