ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి (చిత్తూరు) : రాష్ట్ర వైసిపి కార్యదర్శి మొగసాల క్రిష్ణమూర్తి, సంయుక్త కార్యదర్శి దయానంద గౌడ్, శైలేష్ చక్రవర్తి కలిసి ఆదివారం ఉదయం జడ్పిటిసి కేశవులను పరామర్శించారు. గుడిపాల మండలములోని చీలాపల్లి వద్ద ఉన్న సీఎంసీ హాస్పిటల్ కు వెళ్లారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొంటున్న బైరెడ్డిపల్లి జడ్పీటీసీ మెంబెర్ ఆర్ .కేశవులను పరామర్శించి ప్రమాదపు కారణాలను తెలుసుకున్నారు.










