పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : పాలకొల్లు చించినాడలో 30 పోలీస్ ఏక్ట్ అమలులో ఉందని ఎట్టి పరిస్థితుల్లోనూ సభలు జరగబోనివ్వమని పోలీసులు గట్టి ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో ... అఖిల పక్షం సారధ్యంలో మంగళవారం సంఘీభావ సభ జరిగింది. ఈ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఫార్వర్డ్ బ్లాక్ కార్యదర్శి కఅష్ణమూర్తి, ఎంఎల్ ఏ నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, జనసేన జిల్లా కార్యదర్శి బోనం చినబాబు, సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం, తదితరులు పాల్గొన్నారు.










