
భువనేశ్వర్: చిలీ వేదికగా జరిగే మహిళల జూనియర్ ప్రపంచకప్ హాకీలో ప్రాతినిధ్యం వహించే భారత జట్టును హాకీ ఇండియా(హెచ్ఐ) గురువారం ప్రకటించింది. 20మంది ఆటగాళ్ల బృందానికి ప్రీతి కెప్టెన్గా, రుతుజ వైస్ కెప్టెన్గా వ్యవహించనున్నారు. ఇక పూల్-సిలో ఉన్న భారత్ 29న కెనడాతో తొలి మ్యాచ్ను ఆడనుంది. ఇదే గ్రూప్లో ఉన్న జర్మనీతో నవంబర్ 30న, బెల్జియంతో డిసెంబర్ 2న తలపడనుంది. ప్రతి గ్రూప్లో టాప్-2లో ఉన్న జట్లు క్వార్టర్ఫైనల్కు చేరనున్నాయి. డిసెంబర్ 6నుంచి క్వార్టర్ఫైనల్స్, డిసెంబర్ 8న సెమీఫైనల్, 10న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. గత సీజన్లో భారతజట్టు నాల్గో స్థానంలో నిలిచి తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. ఇక మహిళల జూనియర్ ప్రపంచకప్ హాకీ-2023, నవంబర్ 29నుంచి డిసెంబర్ 10వరకు జరగనుంది.
గోల్కీపర్లు : ఖుష్భూ, మాధురి కిండో
డిఫెండర్లు: నీలమ్, ప్రీతి(కెప్టెన్), జ్యోతి సింగ్, రూప్ని కుమారి
మిడ్ఫీల్డర్లు: మహిమా తెతె, మంజు ఛోస్రియా, జ్యోతి ఛత్రీ, హినా బానో, సుజాత కుజుర్, రుతుజ దడాసో
ఫార్వర్డ్స్: సాక్షి రాణా, ముంతాజ్ ఖాన్, అన్ను, దీపిక షోరెంగ్, దీపి మోనిక, సునేలిటా టప్పో
రీప్లేస్మెంట్స్: నిరుపమా దేవి, ఇ. జ్యోతి.