ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : ఆత్మకూరు మండల పరిధిలో పంపనూరు గ్రామంలో శుక్రవారం ఫారెస్ట్లో ఐఎఎస్ఓడబ్ల్యూఏ ఆధ్వర్యంలో మెగా ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించారు. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి, అసిస్టెంట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ భార్య డా.రిషిఖ, డీఎఫ్ఓ సందీప్ కృపాకర్, తదితరులు పాల్గొని మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, ఎఫ్ఆర్ఓ శ్రీనివాసులు, డిఆర్ఓ హుసేనప్ప, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దామోదర్, తదితరులు పాల్గొన్నారు.










