ప్రజాశక్తి-ఉండి (పశ్చిమ గోదావరి) : ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో నిర్మిస్తున్న ప్రార్థనా మందిరాన్ని క్రైస్తవులకు పవిత్ర రోజైన గుడ్ ఫ్రైడే రోజున జెసిబి సహాయంతో అధికారులు కూల్చివేయడంపై క్రైస్తవ సంఘాలు భగ్గుమన్నాయి. ఈ మేరకు శనివారం ఉదయం ఉండి పార్కు వద్ద నుండి మెయిన్ సెంటర్ వరకు క్రైస్తవులంతా ర్యాలీ నిర్వహించి మెయిన్ సెంటర్లో మానవహారం చేపట్టారు. తమకు తగు న్యాయం జరిగే వరకూ నేటి నుండి నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని పలు క్రైస్తవ సంఘాలు తెలిపాయి.










