Nov 13,2023 12:05

పిడుగురాళ్ల (పల్నాడు) : బైక్‌ను లారీ ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ శివారు కోర్టు వద్ద జరిగింది. బైక్‌ను లారీ ఢీకొట్టడంతో సురేష్‌ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి పిడుగురాళ్ల పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.