Nov 14,2023 20:59

ప్రజాశక్తి - నూజివీడు టౌన్‌
      నూజివీడులో ఈనెల 17న సిఎం జగన్‌ పర్యటనకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ ప్రసన్నవెంకటేష్‌ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా ఎస్‌పి డి.మేరీప్రశాంతితో కలిసి కలెక్టర్‌ మంగళవారం పరిశీలించారు. పర్యటనను విజయవంతం చేసేందుకు ఎవరికి నిర్ధేశించిన విధులను వారు సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. మైలవరం రోడ్డు, పెట్రోల్‌ బంకు సమీపంలోని ఖాళీ స్థలంలో హెలీప్యాడ్‌, అన్నవరం రహదారిలోని ఎంఐజి లే అవుట్‌లో సభావేదిక ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. హెలీప్యాడ్‌ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. పార్కింగ్‌కు నిర్ధేశించిన స్ధలాల నుంచి సభా ప్రాంగణానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా సిఎం కాన్వారు, ఇతర బారికేడ్‌ పనులు, స్టాల్స్‌ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన పలు అంశాలకు సంబంధించి లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే ఈ కార్యక్రమంలో సిఎం పాల్గొంటారని తెలిపారు. దానికి అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ వెంట ఐటిడిఎ పిఒ ఎం.సూర్యతేజ, నూజివీడు సబ్‌ కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన్‌, అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ శ్రీపూజ, డిఎస్‌పి అశోక్‌ కుమార్‌ గౌడ్‌, తహశీల్దారు ఎల్లారావు, అధికారులు ఉన్నారు.