Sep 09,2023 21:18

పరుగు పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : స్థానిక విజ్జీ స్టేడియంలో శనివారం జరిగిన జిల్లా అథ్లెటిక్స్‌ జట్టు ఎంపికలకు క్రీడాకారుల నుంచి విశేష స్పందన వచ్చింది. అథ్లెటిక్స్‌ ఎంపికలను జిల్లా అథ్లెటిక్స్‌ సంఘ సభ్యులు అందరూ కలిపి జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 500 మంది అథ్లెట్స్‌ పాల్గొన్నారు. పరుగు, లాంగ్‌ జంప్‌, హైజంప్‌, డిస్కస్‌త్రో, షాట్‌పుట్‌ వంటి అంశాల్లో ఎంపికలు నిర్వహించారు. ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈ నెల 21 నుండి ఏలూరు ఎఎస్‌ఆర్‌ స్టేడియంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించనున్నారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్‌ అఫీషియల్స్‌గా వ్యాయామ ఉపాధ్యాయులు గౌరీ శంకర్‌, తవిటినాయుడు, ఆనంద్‌ కిశోర్‌, గణేష్‌, బాబ్జీ, రామకృష్ణ, గురు నాయుడు వ్యవహరించారు. సీనియర్‌ క్రీడాకారులు శ్రీనివాస్‌, కోచ్‌లు శ్రీకాంత్‌, మధు, నర్సింగ్‌, శివ, లక్ష్మణ, శేఖర్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.